కరీంనగర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోతిరాంపూర్ సమీపంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు సుద్దాలకు చెందిన అరవింద్గా గుర్తించారు. స్థానికులు అంబులెన్స్లో గాయపడిన వ్యక్తిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.