బైక్‌పై వెళుతూ తండ్రి మృతి చెందగా, కూతురికి తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రి మృతి చెందగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బీహార్‌కు చెందిన పంకజరామ్, అతని కుమార్తె పూజా కుమారి తుర్కపల్లి నుంచి యాడారం వైపు వెళ్లేందుకు మురహరి పల్లి జంక్షన్ వద్దకు వచ్చారు, అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకొచ్చింది.

అతివేగంతో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న తండ్రీకూతుళ్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రి పంకజం అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన పంకజన్‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *