Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్ను రేపు (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనుంది. దీనితో ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పూర్తిగా పనిచేయనున్నాయి. ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రకటనలను బట్టి తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్టాక్ మార్కెట్లు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సాధారణంగా ట్రేడింగ్ చేస్తాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఇది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే తొమ్మిదో బడ్జెట్.
ఫిబ్రవరి 1న సెటిల్మెంట్ హాలిడే కావడంతో కొన్ని ట్రేడింగ్ పరిమితులు ఉంటాయి. జనవరి 30న కొనుగోలు చేసిన షేర్లను బడ్జెట్ రోజున అమ్మలేరు. అలాగే బడ్జెట్ రోజున కొనుగోలు చేసిన స్టాక్స్ను మరుసటి రోజు విక్రయించలేరు. ఇన్వెస్టర్లు ప్రభుత్వ రుణాలు, ద్రవ్య లోటు లక్ష్యాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 4.1 నుంచి 4.2 శాతం మధ్య ఉండొచ్చని అంచనా. ఆర్థిక సర్వే 2025–26ను ఇప్పటికే జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్..
External Links:
బడ్జెట్ కోసం ప్రత్యేక ట్రేడింగ్.. ఆదివారం కూడా పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు