Senior Citizen Railway Concession: 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలపై మళ్లీ రాయితీలు అందే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో 40 నుంచి 50 శాతం వరకు టికెట్ తగ్గింపును పునరుద్ధరించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోవిడ్-19 సమయంలో 2020 మార్చిలో నిలిపివేసిన ఈ సదుపాయంపై బడ్జెట్కు ముందు ఆర్థిక, రైల్వే శాఖల మధ్య చర్చలు సాగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు మళ్లీ రాయితీతో రైలు టికెట్లు పొందే అవకాశం ఉంది.
ఇంతకు ముందు భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లకు, పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం వరకు టికెట్ రాయితీ ఇచ్చేవి. ఈ సౌకర్యం దాదాపు అన్ని తరగతుల్లో, ఆన్లైన్ మరియు కౌంటర్లలో అందుబాటులో ఉండేది. అయితే కోవిడ్ కారణంగా రైల్వేకు భారీ నష్టాలు రావడంతో ఈ కన్సెషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు 2026 బడ్జెట్కు ముందు ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తిరిగి అమలైతే వృద్ధులకు రైలు ప్రయాణం మరింత సులభమవడంతో పాటు, దూర ప్రయాణాలు చేసే వారికి పెద్ద ఊరట కలగనుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్..
External Links:
సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్.. బడ్జెట్లో రైల్వే టికెట్పై రాయితీలు ఉండే ఛాన్స్!