హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం చేపట్టనుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడంలో వారు కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.