ఏపీ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. జగన్ సహా ఎమ్మెల్యేలంతా నల్ల కండువాలు కప్పుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని, 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయని నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.