CM Chandrababu

CM Chandrababu-Political News: ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 25 మంది ఎమ్మెల్యేల పనితీరు, వరుస వివాదాల్లో చిక్కుకోవడం వలన సీఎం అసంతృప్తిగా ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం స్పష్టంగా హెచ్చరించారు. ఇకపై తప్పులు రిపీట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేలపై యాక్షన్ అంటే వారికున్న అధికారాలను తగ్గించడం, అధికారుల సహకారాన్ని నిలిపివేయడం, కొత్త ఇంఛార్జ్ నియమించడం వంటి చర్యలు ఉంటాయని తెలిపారు.

అయితే, ఈ చర్యలు నిజంగానే తీసుకుంటే తప్పు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే చర్చ పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వలన ఎక్కువ సమస్యలు వస్తున్నాయని సీఎం చెబుతున్నారు. వారిని వరుసగా పిలిచి మాట్లాడుతున్నప్పటికీ పరిస్థితి మారకపోతే కఠిన చర్యలు తప్పవు. మొత్తం మీద, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు తప్పులు పునరావృతం చేస్తే ఆయా నియోజకవర్గాల్లో వారి అధికారాలను కట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో, వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకుంటారా లేదా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారా అన్నది చూడాల్సి ఉంది.

Internal Links:

బతుకమ్మ పండుగకు ఇందిరమ్మ చీరలు..

కేటీఆర్‌‌‌‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

External Links:

చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *