BCCI-IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. అయితే ఈసారి ప్రారంభ మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. సాధారణంగా తొలి మ్యాచ్ ముందు జరిగే వేడుకల్లో నటులు, గాయకులు ప్రదర్శనలు ఇస్తారు. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలు ఉండవు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలుపు వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. వారికి నివాళిగా ఈసారి తొలి మ్యాచ్ ముందు ఒక నిమిషం మౌనం పాటించనున్నారు. అలాగే వారి జ్ఞాపకార్థం స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచుతారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు బెంగళూరులో తలపడనున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
తొలి మ్యాచ్కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈ సీజన్లో కీలక మార్పు..