Alert For Tirumala Devotees: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం, నడకదారి భక్తులకు తిరుపతిలో టిక్కెట్లు ఇస్తుండగా, శ్రీవాణి టిక్కెట్లు రేణిగుంట విమానాశ్రయం మరియు తిరుమలలో జారీ చేస్తున్నారు. అయితే ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద రోజూ ఏర్పడుతున్న గందరగోళంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలకు పరిష్కారంగా ఆఫ్లైన్ కోటాను పూర్తిగా ఆన్లైన్ విధానంగా మార్చాలని టీటీడీ యోచిస్తోంది. సర్వదర్శనం, శ్రీవాణి టిక్కెట్లను దర్శనానికి ఒక రోజు ముందే ఆన్లైన్లో విడుదల చేసేలా కొత్త విధానం తీసుకురానుంది. తిరుమల–తిరుపతి పరిధిలో ఉన్నవారికే టిక్కెట్లు అందేలా ప్రత్యేక యాప్ రూపొందించగా, ఈ నూతన విధానాన్ని జనవరి నుంచి అమలు చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు సమాచారం.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆఫ్ లైన్ టికెట్ల జారీకి బ్రేక్..?