వంగూరు మండల కేంద్రంలోని శ్రీ గెల్వలాంబ మాత ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. శ్రావణ మాసంలో వారం రోజుల పాటు గెల్వలాంబ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ కులస్తులతో పాటు బోయ, రెడ్డి, గౌడ, పద్మశాలి కులస్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. పులిపై సవారి చేస్తూ భక్తులకు మహంకాళి అమ్మవారు దర్శనం ఇస్తుంది. అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేస్తారు. పూర్వం సంస్థానాధీశులు దండయాత్ర చేసి ఇక్కడి పశు సంపదను, ధన ధాన్యాలను దోచుకొని వెళ్తుండగా గ్రామస్తులు అమ్మవారిని ప్రార్థించడంతో తెలుపు రంగు పశువులను నలుపు రంగులోకి, నలుపురంగు పశువువులను తెలుపు రంగులోకి మార్చి తిరిగి వచ్చే విధంగా అమ్మవారు చేసిందని స్థానికులు చెబుతుంటారు.

అప్పటి నుంచి గెల్వలాంబ మాతను కొలుస్తారు. బోయ, రెడ్డి, గౌడ, పద్మశాలి, బీసీ కులాల వారు అమ్మవారికి బోనాలు సమర్పించి ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆలయ చైర్మన్ అందుగుల వెంకటస్వామి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *