Indrakeeladri Dasara Utsav 2025

Indrakeeladri Dasara Utsav 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భక్తులను అనుమతించడంతో భారీగా ప్రజలు తరలివచ్చి క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులకు దర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఉదయం 9:30 గంటల వరకు లక్ష మంది దర్శించుకోగా, ఈరోజు 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేసి, అన్ని లైన్లలో ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం హోల్డింగ్ పాయింట్స్, కంపార్ట్‌మెంట్స్‌తో పాటు నీళ్లు, బిస్కెట్లు, పాలు, మజ్జిగ పాకెట్స్ అందిస్తున్నారు.

సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను పలువురు నాయకులు దర్శించుకున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, యనమల దివ్య, ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) దర్శించారు. అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.

Internal Links:

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

ఇంద్రకీలాద్రిపై నాలుగవ రోజు వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. తిరుపతి తరహాలో భక్తులకు ఏర్పాట్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *