Kartika Purnima: కార్తీక మాసం శివపార్వతుల అనుగ్రహం పొందే పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ కాలంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు ముఖ్యమైన ఆచారాలు. వీటిలో ఉసిరి చెట్టు, దాని ఫలం అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టులో శివపార్వతులు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు నివసిస్తారని నమ్మకం ఉంది. కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి రోజుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. స్కంద, పద్మ పురాణాల ప్రకారం ఉసిరి దీపారాధన నవగ్రహ దోషాలను తొలగించి శుభఫలితాలు అందిస్తుందని చెబుతాయి.
ఇక కార్తీక మాసంలో వనభోజనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పురాణాలలో శ్రీకృష్ణుడు నందగోపులతో కలిసి వనభోజనం చేసినట్లు చెప్పబడింది. ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం అత్యంత శుభప్రదమని నమ్మకం. హిందూ ధర్మంలో ఉసిరి చెట్టును ‘దాత్రి’ అని పిలుస్తారు, ఇది క్షమాపణ గుణానికి ప్రతీక. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించి, ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద ధాత్రి కళ్యాణం జరిపితే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?