ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ భారీ వినాయకుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంటున్నాయి. నిమజ్జనం వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ప్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు గణనాథులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి.