నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. వినాయకుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్బండ్ వైపు కదులుతున్నాడు.
రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్బండ్కు చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.