Koti Deepotsavam Day 13: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతీ రోజు ప్రత్యేక పూజలు, కల్యాణాలు, ప్రవచనాలు, వాహన సేవలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రాచుర్యం కోసం ప్రారంభమైన ఈ దీపోత్సవం లక్షల దీపాలతో ప్రారంభమై, ఇప్పుడు కోటి దీపాల యజ్ఞంగా మారింది. కార్తీక మాసం వచ్చిందంటే భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ వేడుక ఈ నెల 1న ప్రారంభమై, నేటితో ముగియనుంది.
ఈ కోటి దీపోత్సవం చివరి రోజు అనేక విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం అందించనున్నారు. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం నిర్వహిస్తారు. వేదికపై కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అమ్మవార్లకు కోటి గాజుల అర్చన ఘనంగా జరుగుతుంది. అనంతరం కంచి ఏకాంబరేశ్వర స్వామి, మధురై మీనాక్షి కల్యాణోత్సవాలు భక్తులకు కన్నుల పండువగా కొనసాగుతాయి. కార్యక్రమం నంది వాహన పల్లకీ సేవతో ముగియనుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
నేటితో కోటి దీపోత్సవం ముగింపు.. చివరి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..