యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ సందర్శించారు. మిస్ యూనివర్స్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పూజారులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమె దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం తర్వాత ఆమెకు శ్రీవారి ఫోటో, ప్రసాదం అందజేశారు.

యాదగిరిగుట్ట ఆలయ విశిష్టత, ఆలయ సంప్రదాయాలు సహా వివిధ వివరాలను విక్టోరియా అడిగి తెలుసుకున్నారు. ఈవో భాస్కర్ రావు మిస్ యూనివర్స్ కు ఆలయ విశిష్టతను వివరించారు. అఖండ దీపారాధన చేసిన విక్టోరియా హెల్విగ్, ఆ తర్వాత మాట్లాడుతూ, ఆలయ సందర్శన అనిర్వచనీయమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *