ముస్లింలు అధికంగా ఉండే పాకిస్థాన్లో జరుపుకుంటున్న ‘జగన్నాథ రథయాత్ర’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రథయాత్రలో ఎంతో మంది హిందువులు పాల్గొన్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ రథయాత్ర జరిగింది. ముస్లిం ఆధిపత్య దేశంలో, హిందూ సమాజం దాని సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. జగన్నాథ రథయాత్ర సాధారణంగా ఒడిశాలోని పూరిలో జరుగుతుంది. అయితే పాకిస్థాన్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
వికాష్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వేడుకను పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్గా మారింది. మత జెండాలతో పాటు పాకిస్థాన్ జెండాలను ప్రదర్శించారు. పాకిస్థాన్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, కరాచీ మరియు లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో హిందువుల సంఖ్య పరిమితంగానే ఉంది. 2023 పాకిస్తాన్ జనాభా లెక్కల్లో 2.17 హిందువుల జనాభా ఉంది. హిందువులు ఎక్కువగా సింధ్ ప్రావిన్స్లో ఉన్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూసిన వాళ్ళు, పాకిస్థాన్లో ఇలాంటి హిందూ వేడుకను చూసి ఆశ్చర్యపోతున్నారు.