నేడు నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా కర్ణాటక మరియు మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది భక్తులు మరియు యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అటవీ శాఖ ఆంక్షలతో జరగనున్నది.
సలేశ్వరం జాతరకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అడవిలోకి అనుమతిస్తామని అటవీ అధికారులు ప్రకటించారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడటం, బీడీలు, చుట్ట, సిగరెట్లు తాగడం కాల్చడాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని సూచించారు.