Tirumala Temple: వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఈసారి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, వసతి గదుల కోటా అదే రోజు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటుంది. భక్తులు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఇప్పటికే ఆన్లైన్ డిప్ విధానంలో కేటాయించామని తెలిపారు.
అదేవిధంగా, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా బుధవారం కృత్తిక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ గోపురాలు, ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి, అనంతరం జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన