హిందువులకు ఎంతో ప్రత్యేమైన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి ఒక్కటి. ఇక్కడి శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. మంగళవారం తిరుమల ఆలయంలో ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో రేపు ఆర్జిత సేవలను, వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా రేపు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకి పై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తారు. అలా ప్రత్యేక పల్లకి పై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా, ఏటా దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఆణివార కార్యక్రమం జరగుతుంది.

ఇది తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలను ఆణివార ఆస్థానం పర్వదినం రోజున స్వీకరించారు. అదే రోజు నుంచి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారింది. ఆనాదికాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వేడుక సందర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జీయర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహింస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *