తిరుమల : శ్రీవారి భక్తుల కోసం అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టిక్కెట్లు, ఆన్‌లైన్ లక్కీడీప్ కోసం ఈనెల 20వ తేదీ ఉదయం పదింటి వరకు నమోదు చేసుకోవచ్చు.

  • ఈ నెల 22న ఉదయం పదింటికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార, సేవాటికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు, వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచుతారు.
  • ఈ నెల 23న ఉదయం పదింటికి అంగప్రదక్షిణం, టోకెన్ల కోటాను జారీ చేస్తారు. 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా … మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
  • ఈ నెల 24వ తేదీ ఉదయం పదింటికి అక్టోబర్ మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడింటికి తిరుమల తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదలవుతుంది.
  • ఈ నెల 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటా, మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *