Aadani Enters: భారతదేశం క్లీన్ ఎనర్జీ వైపు వేగంగా సాగుతున్న వేళ, ఆదానీ గ్రూప్ గుజరాత్లోని ఖవడాలో దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) నిర్మించనుంది. 1126 మెగావాట్ల సామర్థ్యం, 3530 మెగావాట్ అవర్ స్టోరేజ్ కెపాసిటీతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 2026 మార్చిలో ప్రారంభమవుతుంది. 700 బ్యాటరీ యూనిట్లతో నిర్మించే ఈ వ్యవస్థ మూడు గంటల పాటు 1126 మెగావాట్ల విద్యుత్ అందించగలదు. దీతో ఆదానీ గ్రూప్ బ్యాటరీ స్టోరేజ్ రంగంలో అధికారికంగా అడుగుపెడుతోంది.
ఈ ప్రాజెక్ట్తో విద్యుత్ డిమాండ్ను నియంత్రించడం, గ్రిడ్ను స్థిరంగా ఉంచడం, ట్రాన్స్మిషన్ సమస్యలను తగ్గించడం, పునర్వినియోగశీల ఎనర్జీ వినియోగాన్ని పెంచడం సాధ్యమవుతుందని సంస్థ తెలిపింది. లిథియమ్ అయాన్ బ్యాటరీలు మరియు ఆధునిక ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను ఈ ప్రాజెక్ట్లో ఉపయోగిస్తున్నారు. ఇది భారత ఎనర్జీ స్వావలంబన మరియు సుస్థిరతకు కీలకమైన అడుగని గౌతమ్ ఆదానీ చెప్పారు. 2027 నాటికి 15 GWh, తరువాత ఐదేళ్లలో 50 GWh బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా గ్రూప్ పనిచేస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
కొత్త వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ.. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్..