Cost of Gold Dec-15: బంగారం ధరలు తగ్గడం లేదనే చెప్పాలి. రోజురోజుకు రేట్లు పెరుగుతూనే ఉండటంతో కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. గత వారం భారీగా పెరిగిన ధరలు ఈ వారం కూడా అదే జోరుతో కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధర తులంపై రూ.820 పెరిగితే, వెండి కిలోపై రూ.2,900 పెరిగింది. దీంతో సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,34,730కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.1,23,500గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.620 పెరిగి రూ.1,01,050 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కిలో వెండి రూ.2,13,000కి చేరగా, ఢిల్లీ, ముంబై, కోల్కతాల్లో రూ.2,00,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు