న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ స్థిరత్వం మరియు సాధారణ వర్షపాత అంచనాల నేపథ్యంలో దేశం యొక్క జీడీపీ 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. వీలైతే 7.5 శాతం వరకు వృద్ధి రేటు నమోదు చేసుకోవచ్చు. 2023-24లో దేశ జిడిపి 8.2 శాతానికి పెరుగుతుందని సంస్థ తన జూలై ఎకనామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్లీ రివ్యూ(ఎంఇఆర్‌)లో పేర్కొంది.

వినియోగంతో పాటు భారీ పెట్టుబడి కారణంగా జీడీపీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సూచీలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో కనిపించిన ట్రెండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతోందని డైరెక్టర్ జనరల్ ఎన్‌సీఏఆర్ పూనమ్ గుప్తా తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారని కొనియాడారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జిడిపిలో 4.9 శాతంగా కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *