Gold and Silver hike rates: గతేడాది భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొత్త ఏడాదిలో కూడా అదే జోరును చూపిస్తున్నాయి. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. తులం బంగారంపై రూ.1,140 పెరుగుదల నమోదవ్వగా, కిలో వెండిపై రూ.4,000 మార్పు వచ్చింది. దీంతో బంగారం కొనాలనుకునే వారు ఆందోళనకు గురవుతున్నారు.
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1,24,850, 18 క్యారెట్ల బంగారం రూ.1,02,150 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర కూడా ఎక్కువగానే ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి ధర రూ.2,42,000గా ఉండగా, హైదరాబాద్, చెన్నైలో మాత్రం రూ.2,60,000 వరకు చేరింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
కొత్త ఏడాదిలోనూ మగువలకు షాక్.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్