Gold Increased By Rs 550: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇవాళ మరోసారి పసిడి ధరలు పెరిగాయి. తులం బంగారంపై రూ.550 పెరుగగా, వెండి కూడా అదే దారిలో నడిచింది. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.12,426గా, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.11,390గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,13,900కు చేరింది, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.1,24,260గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,050గా, 24 క్యారెట్ల ధర రూ.1,24,410గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,87,000గా ఉండగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,77,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి