Gold Market Today: ట్రంప్ సుంకాల ప్రభావమా, లేక హెచ్ 1బీ వీసాల ప్రభావమా తెలియదు గానీ, బంగారం ధరలు పెరిగిపోతోన్నాయి. కొంతమంది ధరలు తగ్గాలని ఆశిస్తున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకూ షాక్ ఇస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరుగుతుండడంతో, పసిడి కొనడం ఇప్పుడు కష్టమే అయింది. సోమవారం తులం గోల్డ్ ధర రూ.430 పెరిగింది. కిలో వెండిపై రూ.3,000 పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో బంగారం కొనదలచిన వారిని గుండె మీద చేయి పెట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరగడంతో రూ.1,12,580 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరగి రూ.1,03,200 వద్ద అమ్ముడవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరగి రూ.84,440 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర రూ.3,000 పెరగి రికార్డ్ స్థాయిలో రూ.1,38,000 వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,48,000 వద్ద, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,38,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
External Links:
పసిడి ప్రియులకు షాక్.. నేడు ఎంత పెరిగిందంటే..!