Gold Rate-Thursday: దాదాపు వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు అనూహ్యంగా మళ్లీ పెరుగుదల దిశగా కదలడం మొదలుపెట్టాయి. ఇదే సమయంలో వెండి కూడా పెరుగుతూ ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితులపై పెరుగుతున్న అనిశ్చితులు బంగారం రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. గత వారం రోజులు క్రమంగా తగ్గిన ధరలు గురువారం నుంచి మళ్లీ ఎగబాకడం ప్రారంభించాయి. ముఖ్యంగా శుభకార్యాలు, పండుగలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో రేట్ల మార్పులను గమనించడం అవసరం.
24 క్యారెట్ల బంగారం ధర ఆగస్టు 20తో పోల్చితే ఆగస్టు 21న 10 గ్రాములకు రూ.60 పెరిగింది. అంటే గ్రాముకు రూ.6 చొప్పున పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి కంటే ఇవాళ 10 గ్రాములకు రూ.50 పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ రేట్లు నమోదయ్యాయి. బంగారం తో పాటు వెండి ధరలు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఆగస్టు 21న వెండి ధర కేజీకి రూ.1000 పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.1,26,000కు చేరుకుంది. అంటే గ్రాముకు రూ.126 వద్ద కొనసాగుతోంది.
Internal Links:
External Links:
గురువారం పెరిగిన గోల్డ్-సిల్వర్.. తెలంగాణ నగరాల్లో రేట్లివే..