Aug-28 Gold Rates

Gold Rates: నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, సామాన్యుల బంగారంగా పిలుచుకునే వెండి ధరలు ఊహించని రీతిలో వేగంగా పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు దేశంలోనే అత్యధిక స్థాయిలకు చేరడంతో సామాన్యులు మరియు వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గింది. ముఖ్య నగరాల్లో గ్రాముకు పసిడి ధరలు చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, పూణే, మంగళూరు, బళ్లారిలో రూ.9,145గా ఉండగా, వడోదరలో రూ.9,150, నాశిక్‌లో రూ.9,148, జైపూర్, లక్నో, గురుగ్రాము, నోయిడా, అయోధ్య, దిల్లీలో రూ.9,160 వద్ద ఉన్నాయి.

అదే విధంగా, నేడు 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.1100 తగ్గింది. దీనితో గ్రాముకు రేట్లు చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, పూణే, మంగళూరు, బళ్లారిలో రూ.9,977గా ఉండగా, వడోదరలో రూ.9,982, నాశిక్‌లో రూ.9,980, జైపూర్, లక్నో, గురుగ్రాము, నోయిడా, అయోధ్య, దిల్లీలో రూ.9,992గా నమోదయ్యాయి. ఈ ధరల తగ్గుదల పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం కలిగించినప్పటికీ, వెండి ధరల పెరుగుదల మాత్రం ఆందోళనను పెంచుతోంది.

Internal Links:

పసిడి ధరలు పైపైకి..

భారీ షాకిస్తున్న బంగారం ధర..

External Links:

మంగళవారం తగ్గిన గోల్డ్ రేట్లు.. రూ.4వేలు పెరిగిన వెండి, హైదరాబాద్ రేట్లివే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *