Gold Rush In India: ప్రస్తుతం బులియన్ మార్కెట్లో అపూర్వమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతుండటంతో కొనకపోతే నష్టం వస్తుందనే భయంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ కొనుగోళ్లకు పరుగులు తీస్తున్నారు. గత పది రోజుల్లోనే తులం బంగారం ధర రూ.32,000కు పైగా పెరగడం పెద్ద సంచలనంగా మారింది. హైదరాబాద్, ప్రొద్దుటూరులో నగల దుకాణాల వద్ద భారీగా రద్దీ కనిపిస్తోంది. చాలామంది ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో మళ్లీ కొత్త బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తున్నారు. గోల్డ్ లోన్లకు డిమాండ్ పెరగడంతో కొన్ని బ్యాంకులు నగదు కొరత ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఏర్పడింది.
మునుపు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇళ్ల అమ్మకాలలో ఆలస్యం కావడం, తక్షణ లాభం కోసం గోల్డ్ బిస్కెట్లు, వెండి ఇటుకలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.85 లక్షలుగా ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో రూ.2 లక్షలకుపైగా చెల్లించి ముందస్తు బుకింగ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో బంగారం తులం రూ.2.5 లక్షలు, వెండి కిలో రూ.5 లక్షలు చేరవచ్చనే ఊహాగానాలతో ఈ ‘గోల్డ్ రష్’ కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగులు.. షాపుల ముందు క్యూ కట్టి మరీ!