Gold & Silver Price Today: బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల దిశగా పరిగెత్తుతున్నాయి. గతంలో లక్షా 30 వేల మార్క్‌ను దాటిన తర్వాత కాస్త తగ్గిన గోల్డ్ రేట్లు తాజాగా మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటుచేసుకోవడంతో దేశీయంగా కూడా ధరలు పెరుగుతూ పసిడి వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. శనివారం (22 నవంబర్ 2025) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,860 పెరిగి రూ.1,25,840, 22 క్యారెట్ల బంగారం రూ.1,700 పెరిగి రూ.1,15,350 గా ఉన్నాయి. వెండి కిలో ధర కూడా రూ.3,000 పెరిగి రూ.1,64,000 కు చేరింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.1,25,840, 22 క్యారెట్ల ధర రూ.1,15,350 గా ఉండగా, కిలో వెండి రూ.1,72,000గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,990, ముంబైలో రూ.1,25,840, చెన్నైలో ఇది రూ.1,26,880 కి చేరింది. అన్ని నగరాల్లో వెండి కిలో ధర రూ.1,64,000 నుంచి రూ.1,72,000 మధ్య ఉన్నది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

EPFO నిబంధనల్లో మార్పు..

భారీ లేఆఫ్స్‌ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!

External Links:

ఓర్నాయనో.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే..

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *