Gold Value High: బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ వెళ్తున్నాయి. పసిడి ధరలు తగ్గే సూచనలు లేకుండా ఎగబాకుతున్నాయి. ఈరోజు మళ్లీ బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. నేడు తులం బంగారం ధర రూ.1150 పెరిగింది. అయితే కిలో వెండి ధర రూ.100 తగ్గింది. తులం పసిడి ధర రూ.1.30 లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,317 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,290గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.1,12,900కు చేరింది.
అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1150 పెరిగి రూ.1,23,170 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,320 వద్ద ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు కిలో వెండి ధర రూ.1,67,000 వద్ద ఉండగా, ఢిల్లీలో కిలో వెండి రూ.1,57,000కు అమ్ముడవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తున్న బంగారం.. ఇవాళ రూ. 1150 పెరిగిన గోల్డ్ ధర