High Price of Gold: దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో మే నెల వరకు వేలాది వివాహాలు జరగనున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.3,220 పెరగగా, కిలో వెండి ధర రూ.10,000 పెరిగింది. ధరలు రాకెట్లా పెరుగుతుండటంతో పెళ్లిళ్లకు ఆభరణాలు ఎలా కొనాలంటూ ప్రజలు ఆలోచనలో పడుతున్నారు.
ధరల పెరుగుదలతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,400కు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,880కు అమ్ముడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు చేరగా, ఢిల్లీ, ముంబై, కోల్కతా మార్కెట్లలో కిలో వెండి ధర సుమారు రూ.3,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
పెళ్లిళ్ల సీజన్ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర