Breaking Telugu News-5

News5am, Breaking Business News (15-05-2025)గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయి అయిన 3.16 శాతానికి తగ్గింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం కూడా మార్కెట్లకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 182.34 పాయింట్లు పెరిగి 81,330.56 వద్ద ముగిసింది. ఇది ట్రేడింగ్‌లో గరిష్టంగా 81,691.87, కనిష్టంగా 80,910.03 స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 88.55 పాయింట్లు పెరిగి 24,666.90 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ వంటి షేర్లు లాభపడాయి. భారతీ ఎయిర్‌టెల్ మార్చి క్వార్టర్లో ఐదు రెట్లు పెరిగిన రూ.11,022 కోట్ల నికర లాభంతో షేరు ధర పెరిగింది. అయితే టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్ నికర లాభం 51 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పడిపోవడంతో వాటి షేరు ధర పడిపోయింది. టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా 13 నెలల కనిష్ట స్థాయి అయిన 0.85 శాతానికి చేరిందని ప్రభుత్వం తెలిపింది.

More Business News

రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’..

దిగొస్తున్న బంగారం ధరలు..

More Breaking Business News: External Sources:



ఇన్‌ఫ్లేషన్ డౌన్‌..మార్కెట్ అప్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *