Latest Gold and Silver Vlaues: కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి సందర్భంగా బంగారం, వెండి కొనాలనుకునే వారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా గ్రాము మేలిమి బంగారం ధర రూ.14 వేలను దాటడంతో మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెండి ధరలు కూడా ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే పండుగ తర్వాత ధరలు తగ్గవచ్చనే ఆశతో కొందరు వేచి చూస్తున్నారు, ఎందుకంటే గతంలో దీపావళి తర్వాత రేట్లు తగ్గిన ఉదాహరణలు ఉన్నాయి.
డిసెంబర్ 26, 2025న రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.77 పెరిగి హైదరాబాద్ సహా పలు నగరాల్లో రూ.14,002గా ఉంది. అదే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,835గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా కేజీకి రూ.6,000 పెరిగి ప్రధాన నగరాల్లో కేజీ ధర రూ.2,54,000కు చేరింది. దీంతో గ్రాము వెండి ధర రూ.254గా నమోదైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం.. కొనసాగుతున్న వెండి దూకుడు..