Latest Gold Rate: పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగిపోయాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు ఎగసిపడ్డాయి. తులం బంగారంపై రూ.440 పెరగగా, వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగింది. దీంతో వెండి ధరలు ఆల్టైమ్ రికార్డు దిశగా పరిగెడుతున్నాయి.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,880కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,300కి పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.86,160కి చేరింది. కిలో వెండి ధర రూ.1,43,000 వద్ద ఉండగా, చెన్నైలో ఇది రూ.1,53,000కి చేరింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం వెండి ధర రూ.1,43,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
బంగారం ధరల్లో ఊహించని మార్పు..
External Links:
గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!