Mar-10 Gold and Silver: పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం ధరలు మళ్లీ పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్ది రోజులుగా ధరలు కొంత తగ్గడంతో ప్రజలు సంతోషించారు. కానీ తాజాగా అంతర్జాతీయ పరిస్థితులు మారడంతో ధరలు మళ్లీ పెరిగాయి. తులం బంగారం ధరపై రూ.700 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.1,48,850గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.530 పెరిగి రూ.1,21,790గా ఉంది.
ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే కిలో వెండి ధరపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,000కు చేరింది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.3,00,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లో రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!