న్యూఢిల్లీ: ఎస్​బీఐ రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఉపయోగించే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని మార్చింది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ ఎంసీఎల్ఆర్​ను 8.10శాతం నుంచి 8.20శాతానికి, ఒక నెల ఎంసీఎల్ఆర్​ను 8.35శాతం నుంచి 8.45శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్​ను 8.40శాతం నుంచి 8.50శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్​ను 8.75శాతం నుంచి 8.85శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్​ను 8.85శాతం నుంచి 8.95శాతానికి పెంచింది.

రెండేళ్ల ఎంసీఎల్ఆర్​ను 8.95శాతం నుంచి 9.05శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్​ను 9.00శాతం నుంచి 9.10శాతానికి పెంచింది. ఫలితంగా హోంలోన్​వంటి లోన్ల వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎంసీఎల్ఆర్​ అనేది బ్యాంకులు లోన్ల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కనీస వడ్డీ రేటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *