Price of Gold: బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ తగ్గే సూచనలు లేకుండా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. తులం బంగారం రూ.220 పెరిగి, కిలో వెండి రూ.1000 ఎగబాకింది. తులం బంగారం ధర ఇప్పుడు లక్షా 30 వేల మార్క్ వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.220 పెరిగి రూ.1,24,150కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.200 పెరిగి రూ.1,13,000 వద్ద ఉంది.
ఇక వెండి ధరలు కూడా పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. ఈరోజు కిలో వెండి రూ.1000 పెరిగి రూ.1,70,000 చేరింది. కేవలం ఆరు రోజుల్లోనే బంగారం రూ.5,620 పెరగగా, వెండి రూ.9,000 ఎగబాకడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తున్న బంగారం…
External Links:
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 6 రోజుల్లోనే రూ. 5,620 పెరిగిన గోల్డ్ ధర..