Gold Cost

Rates of silver increased: వెనిజులా సంక్షోభం తీవ్రంగా మారడంతో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది యుద్ధాల కారణంగా పెరిగిన ధరలు కొత్త ఏడాదిలో తగ్గుతాయని ఆశించినప్పటికీ, తాజా పరిణామాలతో ధరలు సునామీలా ఎగసిపడుతున్నాయి. ఈరోజు ఒక్కరోజే కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌, చెన్నైలో కిలో వెండి ధర రూ.2,83,000కి చేరింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.2,63,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదేవిధంగా బంగారం ధరలు కూడా పెరిగాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.660 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.1,27,850గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.1,04,610 వద్ద ట్రేడ్ అవుతోంది. వెనిజులా సంక్షోభం కొనసాగితే బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…

పసిడి ప్రియులకు మళ్లీ షాక్…

External Links:

వామ్మో.. సిల్వర్.. మళ్లీ విశ్వరూపమే.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *