Sensex Nifty Down: కేంద్ర బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. భారత్–ఈయూ డీల్ తర్వాత మార్కెట్ బలపడుతుందని నిపుణులు అంచనా వేసినా, పరిస్థితి భిన్నంగా మారింది. కనీసం బడ్జెట్ సమయంలోనైనా మార్కెట్ పుంజుకుంటుందని భావించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురైంది. మార్కెట్ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతూ అల్లకల్లోలంగా మారింది.
ప్రస్తుతం సెన్సెక్స్ సుమారు 498 పాయింట్లు నష్టపోయి 81,842 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు తగ్గి 25,197 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే 92 మార్కును దాటి కనిష్ట స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు ఇందుకు కారణంగా మారాయి. నిఫ్టీలో మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎం అండ్ ఎం నష్టపోగా, ఎల్ అండ్ టి, హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాభపడ్డాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
బడ్జెట్కు ముందు మార్కెట్ పతనం.. భారీ నష్టాల్లో సూచీలు