2025 సంవత్సరం ప్రారంభం అయిన దగ్గర నుంచి బంగారం ధరలు కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు గ్యాప్ ఇవ్వకుండా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న తులానికి 380 పెరిగిన బంగారం మరో సారి భారీగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.380 లు పెరిగి 87వేల 050లకు చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400లు పెరిగి 79వేల 800 లకు చేరింది.
నేడు హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 110 పెరిగి రూ. 87వేల160లు, 22 క్యారెట్ల తులం బంగారం ధర 100పెరిగి రూ. 79వేల 900లుగా ఉంది. మరో వైపు హైదరాబాద్ లో వెండికి కూడా డిమాండ్ పెరిగింది. కొనుగోలు ఎక్కువగా ఉండటంతో కిలో వెండి ధర రూ. లక్షా 07వేలుగా ఉంది.