Silver rates: సిల్వర్ ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది సెన్సేషన్ సృష్టించినట్లే ఈ ఏడాదీ అదే జోరు కొనసాగుతోంది. వెనిజులా సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కిలో వెండి ధర రూ.3 లక్షల దిశగా సాగుతుండగా, నిన్న రూ.6,000 పెరిగిన ధర ఈరోజు మరో రూ.5,000 పెరిగి రికార్డు స్థాయికి చేరింది.
దీంతో ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,53,000గా నమోదైంది. హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో మాత్రం ఇది రూ.2,71,000కు చేరింది. అదే సమయంలో బంగారం ధరలు కూడా పెరిగాయి. ఈరోజు తులం గోల్డ్పై రూ.600 పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,820గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,27,250కి, 18 క్యారెట్ల ధర రూ.1,04,120కి చేరింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రూ.14వేలు దాటిన గ్రాము 24K బంగారం…
External Links:
సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!