Stock Market Nifty

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతం లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, భారత్-అమెరికా వాణిజ్య పరిణామాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించాయి. దీంతో మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి. నిఫ్టీ రికార్డు స్థాయిలను తాకగా, సెన్సెక్స్ కొత్త గరిష్టాలను నమోదు చేసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 355.97 పాయింట్లు ఎగబాకి 81,904.70 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 108.50 పాయింట్లు పెరిగి 25,114 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 2 లక్షల కోట్లు చేరి రూ. 459 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య సెన్సెక్స్ ఉదయం 81,758.95 వద్ద ప్రారంభమై రోజంతా గరిష్టంగా 81,992.85 పాయింట్లను తాకింది.

నిఫ్టీ 30 కంపెనీలలో రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ లాభపడ్డాయి. బీఎస్ఈలో మొత్తం 3,649 షేర్లు ట్రేడయ్యాయి. అందులో 2,174 లాభపడి, 1,356 నష్టపోయాయి. 119 షేర్లలో మార్పులేకుండా ట్రేడింగ్ ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ వ్యాప్తి బలంగా ఉండగా, అడ్వాన్సెస్-డిక్లైన్స్ నిష్పత్తి 66.76గా నమోదైంది.

Internal Links:

మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్‌..

నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో..

External Links:

ఎనిమిదవ రోజు లాభపడిన నిఫ్టీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *