దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపరకు బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల కారణంగా నష్టాలతో ప్రారంభమైంది. చివరి వరకు సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 81,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 24,918 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.83.98 దగ్గర ముగిసింది.
టాటా మోటార్స్, ఒఎన్జిసి, విప్రో, ఎస్బిఐ, హిందాల్కో, ఎన్టిపిసి, బిపిసిఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, జెఎస్డబ్ల్యు స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.