దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో మంగళవారం లాభాల పరంపర కొనసాగుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు గ్రీన్లోనే ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు సూచీలకు దోహదపడ్డాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 81,921 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25,041 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.83.97గా ఉంది.
నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, ఎల్టిఐఎండ్ట్రీ, భారతీ ఎయిర్టెల్, విప్రో మరియు హెచ్సిఎల్ టెక్ లాభపడగా, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు 2 శాతం మేర పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్ కేర్, పవర్ రంగాలు ఒక్కొక్కటి 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం లాభపడ్డాయి.