దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్కు కలిసొచ్చింది. దీంతో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు టాప్ రేంజ్ లో వర్తకం అయ్యాయి. సెన్సెక్స్ 874 పాయింట్లు లాభపడి 79,468 వద్ద ముగిసింది. నిఫ్టీ 304 పాయింట్లు లాభపడి 24,297 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.83.95 వద్ద స్థిరంగా ముగిసింది.
నిఫ్టీలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, విప్రోలు లాభపడగా ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, టెక్ మహీంద్రా మరియు టైటాన్ కంపెనీ నష్టపోయాయి. మెటల్, హెల్త్కేర్, మీడియా, పవర్, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ 2-3 శాతంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2 శాతం చొప్పున పెరిగాయి. ఆర్బీఐ పాలసీ ఫలితాలకు ముందు భారీ లాభాలతో ముగియడం శుభసూచికంగా నిపుణులు పరిగణిస్తున్నారు.