శుక్రవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 81, 086 దగ్గర ముగియగా నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24, 823 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ రూ.83.95 దగ్గర రికార్డ్ స్థాయిలో ముగిసింది.

నిఫ్టీలో బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో కొనసాగగా.. విప్రో, ఓఎన్‌జీసీ, దివిస్ ల్యాబ్స్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. సెక్టార్లలో ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగ్గా మెటల్, రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ 0.5-2.5 శాతం చొప్పున క్షీణించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *