Today Price of Gold: దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా వరుసగా బంగారం ధరలు ఎగసిపోతోంది. నేడు బులియన్ మార్కెట్లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,889, 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడీపై రూ.540 పెరిగి రూ.1,28,890కి, 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.500 పెరిగి రూ.1,18,150కి చేరింది. హైదరాబాద్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,890, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,150గా ఉంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా బంగారం కొనడానికి బయటపడుతున్నారు. నిపుణుల ప్రకారం పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో డిమాండ్ పెరుగుతోంది, అంతర్జాతీయ పరిణామాల కారణంగా పసిడి ధరలు మరింత పెరుగుతాయని సూచిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి వెండి ధర చేరింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,90,000గా ట్రేడ్ అవుతోంది, హైదరాబాద్లో రూ.2,07,000కి చేరింది. ఈ వారం రోజుల్లో వెండి ధరలు వరుసగా 3, 7, 7, 6, 0, 5, 4, 1 వేలు పెరిగాయి. పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు వెండి కొనడానికి కూడా వెనకంజ వేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్…
బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ రికార్డు: 10 గ్రాముల పసిడి ₹1.25 లక్షలు దాటి, మార్కెట్లో కలకలం
External Links:
బంగారం ధరలు మళ్లీ జంప్.. హైదరాబాద్లో తులం లక్ష 29 వేలు!