Bangalore sexual assault case: బెంగళూరులోని వైట్ఫీల్డ్లోని ప్రో4లివింగ్ పీజీలో నివసిస్తున్న 24 ఏళ్ల యువతి పై ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయిబాబు చెన్నూరు (37) కత్తితో దాడి చేసి, లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాయిబాబు గదిలోకి చొరబడి, కత్తితో బెదిరించి, వెనుకభాగంలో గాయపరచినట్టు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఆమె బట్టలు విప్పి, మొబైల్ ఫోన్లో ఫోటోలు తీసి, లైంగిక సంబంధానికి ఒత్తిడి చేశాడని, నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని పేర్కొంది. ప్రాణభయంతో డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా రూ.14 వేలు బదిలీ చేసినట్లు పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వైట్ఫీల్డ్ పోలీసులు హత్యాయత్నం, లైంగిక దాడి, బెదిరించి డబ్బు వసూలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడు సాయిబాబును అరెస్ట్ చేశారు. అయితే, సాయిబాబు సెప్టెంబర్ 17న పీజీ మేనేజర్లు ప్రదీప్, శివ తదితరులపై కౌంటర్ ఫిర్యాదు చేశారు. తనకు యువతితో రెండు నెలలుగా సంబంధం ఉందని, గొడవలో వారు తనపై దాడి చేశారని ఆరోపించాడు. పోలీసులు రెండు కేసులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన పీజీలలో మహిళల భద్రతపై చర్చను మళ్లీ వేగవంతం చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
హైదరాబాద్ కోకాపేట్లో దారుణం..
కర్ణాటకలో సినిమా తరహా దోపిడీ..
External Links:
బెంగళూరులో యువతికి కత్తిపోట్లు, లైంగిక వేధింపులు… కౌంటర్ ఫిర్యాదు చేసిన నిందితుడు!